తొలిజ్యోతి రాజన్నసిరిసిల్ల బ్యూరో 05 డిసెంబర్ 2023,
- సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న ఏఈ నరసిహంహ ఫై 37 వ వార్డు కౌన్సిలర్ దిడ్డి మాధవి భర్త,దిడ్డి రాజు తనను కులం పేరుతో దూషించాడు అంటూ సుమారు 70 మంది మున్సిపల్ సిబ్బంది తో వచ్చి మంగళవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే మున్సిపల్ పరిధిలోని 37 వ వార్డులో మురికి కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పనులు నిర్వహిస్తున్నారని, కానీ నిబంధనలు పాటించకుండా తాము చెప్పిన విధంగానే పనులు చేయాలని, లేకపోతే ట్రాన్స్ఫర్ చేపిస్తానంటూ హెచ్చరిస్తూ, కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదుదారులు మీడియాతో వెల్లడించారు.